ఢిల్లీ: మద్యం కేసులో కేజ్రీవాల్ బెయిల్ను ఢిల్లీ హైకోర్టులో ఈడీ సవాలు చేసింది. పిటిషన్ను త్వరితగతిన సమీక్షించాలని అభ్యర్ధించింది. ఈ సందర్భంలో విచారణను పర్యవేక్షించిన హై కోర్టు, ట్రయల్ కోర్టు బెయిల్ తీర్పుపై స్టే విధించింది.
ఈడీ పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ మంజూరును నిలుపుదల చేస్తూ హై కోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆప్ శిబిరంలో విషాదం నెలకొంది.