నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎల్బీనగర్, పాతబస్తీ, రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, కొత్తపేట, సరూర్నగర్, చంపాపేట్, సైదాబాద్, మాదన్నపేట్, మలక్పేట, చాదర్ఘాట్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం వర్షం కురిసింది.
రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షపాతానికి ఉపరితల ఆవర్తనం కారణమని కనుగొన్నారు. శనివారం విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.